ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానఁ గాని
పూరిజీవులము, నీవు పురుషోత్తముఁడవు
పూరిజీవులము, నీవు పురుషోత్తముఁడవు
అసురలు భువిఁ బుట్టుటది వుపకారమే
అసురలు బాధింతు రమరులను
పొసఁగ వారికిఁగాను పూనుకవచ్చి నీవు
వసుధ జనించితేను వడి నిన్నుఁ గందుము
అసురలు బాధింతు రమరులను
పొసఁగ వారికిఁగాను పూనుకవచ్చి నీవు
వసుధ జనించితేను వడి నిన్నుఁ గందుము
అడరి ధర్మము చెడి యధర్మమైనా మేలు
వెడఁగు మునులు విన్నవింతురు నీకు
తడవి ధర్మము నిల్ప ధరణిఁ బుట్టుదు నీవు
బడి నిన్ను సేవించి బ్రదుకుదు మపుడే
వెడఁగు మునులు విన్నవింతురు నీకు
తడవి ధర్మము నిల్ప ధరణిఁ బుట్టుదు నీవు
బడి నిన్ను సేవించి బ్రదుకుదు మపుడే
నీకంటే మాకుఁ జూడ నీదాసులే మేలు
పైకొని వారున్నచోటఁ బాయకుందువు
చేకొని శ్రీవేంకటేశ చెప్పఁగానే వారిచేత
నీకథలు విని విని నే మీడేరితిమి
పైకొని వారున్నచోటఁ బాయకుందువు
చేకొని శ్రీవేంకటేశ చెప్పఁగానే వారిచేత
నీకథలు విని విని నే మీడేరితిమి
భావామృతం :
ఓ ప్రభూ! మేము నిన్ను ఊరకనే చూడాలంటే సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే నీవేమో పురుషోత్తముడవు. మేమేమో పూరి జీవులము. (గడ్డితినే పశువుల్లాంటి, అజ్ఞానులం).
రాక్షసులు భూమిపై జన్మించుట చేత వుపకారమే జరిగింది. ఎందుకంటేవాళ్ళు అట్లాపుట్టి దేవతలను బాధించ బట్టేకదా! వారిని సంహరించుటకు నీవు భూమిపై జన్మిస్తావు. అప్పుడు నిన్ను కనులారా చూచి మేము తరించగలము లేకపోతే నీవెందుకు వస్తావు, మేం నిన్ను ఎట్లా చూస్తాము?
విజృంభించి ధర్మం పూర్తిగా చెడిపోయు అధర్మం పెట్రేగిపోవడమే మంచిది స్వామీ! ఎందుకంటే అటువంటప్పుడు ధర్మసంస్థాపన కొఱకు నేను మరల మరల భూమిపై జన్మిస్తాను అని భగవద్గీతలో నీవే చెప్పావు కదా!! ధర్మం చెడగానే పాపం వెర్రి మునులంతా గగ్గోలు పెడతారు. అప్పుడు పాపులనడ్డగించి ధర్మం నిలబెట్టిటానికి నీవు భూమిపై అవతరిస్తావు. అప్పుడు నిన్ను సేవిస్తూ బ్రతుకవచ్చును. ఓ వేంకటేశ్వరా! మాకు నీకంటే నీ దాసులవల్లనే ఎక్కువ వుపకారం జరుగుతుంది. ఎందుకంటే వారున్న చోట నీవు తప్పకవుంటావు కదా! వాళ్ళ ద్వారా నీ కథలు వినీ వినీ మేము ధన్యులయ్యాము తండ్రీ!
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)
ఓ ప్రభూ! మేము నిన్ను ఊరకనే చూడాలంటే సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే నీవేమో పురుషోత్తముడవు. మేమేమో పూరి జీవులము. (గడ్డితినే పశువుల్లాంటి, అజ్ఞానులం).
రాక్షసులు భూమిపై జన్మించుట చేత వుపకారమే జరిగింది. ఎందుకంటేవాళ్ళు అట్లాపుట్టి దేవతలను బాధించ బట్టేకదా! వారిని సంహరించుటకు నీవు భూమిపై జన్మిస్తావు. అప్పుడు నిన్ను కనులారా చూచి మేము తరించగలము లేకపోతే నీవెందుకు వస్తావు, మేం నిన్ను ఎట్లా చూస్తాము?
విజృంభించి ధర్మం పూర్తిగా చెడిపోయు అధర్మం పెట్రేగిపోవడమే మంచిది స్వామీ! ఎందుకంటే అటువంటప్పుడు ధర్మసంస్థాపన కొఱకు నేను మరల మరల భూమిపై జన్మిస్తాను అని భగవద్గీతలో నీవే చెప్పావు కదా!! ధర్మం చెడగానే పాపం వెర్రి మునులంతా గగ్గోలు పెడతారు. అప్పుడు పాపులనడ్డగించి ధర్మం నిలబెట్టిటానికి నీవు భూమిపై అవతరిస్తావు. అప్పుడు నిన్ను సేవిస్తూ బ్రతుకవచ్చును. ఓ వేంకటేశ్వరా! మాకు నీకంటే నీ దాసులవల్లనే ఎక్కువ వుపకారం జరుగుతుంది. ఎందుకంటే వారున్న చోట నీవు తప్పకవుంటావు కదా! వాళ్ళ ద్వారా నీ కథలు వినీ వినీ మేము ధన్యులయ్యాము తండ్రీ!
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)
Watch for audio - https://youtu.be/xndWI2tCm1A
No comments:
Post a Comment