పలుకుఁదేనెల తల్లి పవళించెను
కలికితనముల విభునిఁ గలసినది గాన
కలికితనముల విభునిఁ గలసినది గాన
నిగనిగని మోముపై నెఱులు గెలఁకులఁ జెదర
పగలైన దాఁకఁ జెలి పవళించెను
తెగని పరిణతులతోఁ దెల్లవాఱినదాఁక
జగదేకపతి మనసు జట్టిగొనెఁగాన
పగలైన దాఁకఁ జెలి పవళించెను
తెగని పరిణతులతోఁ దెల్లవాఱినదాఁక
జగదేకపతి మనసు జట్టిగొనెఁగాన
కొంగుజాఱిన మెఱుఁగు గుబ్బలొలయఁగఁ దరుణి
బంగారు మేడపైఁ బవళించెను
చెంగలువ కనుఁగొనల సింగారములు దొలఁక
నంగజగురినితోడ నలసినదికాన
బంగారు మేడపైఁ బవళించెను
చెంగలువ కనుఁగొనల సింగారములు దొలఁక
నంగజగురినితోడ నలసినదికాన
మురిపెంపు నటనతో ముత్యాలమలఁగుపై
పరవశంబునఁ దరుణి పవళించెను
తిరువేంకటచలాధిపుని కౌఁగిటఁ గలసి
యరవిరైనునుఁ జెమట నంటినదికాన
పరవశంబునఁ దరుణి పవళించెను
తిరువేంకటచలాధిపుని కౌఁగిటఁ గలసి
యరవిరైనునుఁ జెమట నంటినదికాన
భావామృతం
తేనెలూరు తీయని పలుకులు మాట్లాడే అలమేలు మంగమ్మ తల్లి నిదురించుచున్నది. స్త్రీకి పరిపూర్ణత్వమును కలిగించే పతితో రతిపై ఆసక్తి కలిగిన ఆమె తన వల్లభునితో సంగమించినది.
నిగనిగమని ప్రకాశించు ముఖముపై ముంగురులు చెదిరి ఆడుచున్నవి. పగలైపోయినా ఆమె పవళించియే ఉన్నది. అంతులేని ప్రావీణ్యముతో ఆ తల్లి, జగదీశ్వరుడైన తన పతి మనసును ఆకట్టుకొని యున్నది. కావున బడలి శయనించుచున్నది.
ఆమె పయ్యెద స్థాన భ్రంశమునందగా మెఱయు స్తనయుగ్మము విస్తరించి యున్నవి. ఆ భామామణి బంగారపు మేడపై నిదురించుచున్నది. ఎఱ్ఱ కలువల వంటి సోగ కన్నులలో శృంగారం అతిశయించి ఆమె మదనుని జనకునితో మన్మధ యుద్ధమున అలిసిపోయియున్నది. అందుచే ఆ తల్లి నిదురించుచున్నది.
మురిపెము లొలుకు అభినయం చూపిన ఆ తల్లి ముత్యాల హంసతూలికా తల్పంపై పరవశురాలై పవ్వళించి యున్నది. తిరుమలాధీశుడైన శ్రీవేంకటపతి కౌగిటిలో కరిగిపోయిన ఆ తల్లి అరవిచ్చిన మొగ్గవలె చిరుచెమటలు కమ్మి శయనించుచున్నది.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)
తేనెలూరు తీయని పలుకులు మాట్లాడే అలమేలు మంగమ్మ తల్లి నిదురించుచున్నది. స్త్రీకి పరిపూర్ణత్వమును కలిగించే పతితో రతిపై ఆసక్తి కలిగిన ఆమె తన వల్లభునితో సంగమించినది.
నిగనిగమని ప్రకాశించు ముఖముపై ముంగురులు చెదిరి ఆడుచున్నవి. పగలైపోయినా ఆమె పవళించియే ఉన్నది. అంతులేని ప్రావీణ్యముతో ఆ తల్లి, జగదీశ్వరుడైన తన పతి మనసును ఆకట్టుకొని యున్నది. కావున బడలి శయనించుచున్నది.
ఆమె పయ్యెద స్థాన భ్రంశమునందగా మెఱయు స్తనయుగ్మము విస్తరించి యున్నవి. ఆ భామామణి బంగారపు మేడపై నిదురించుచున్నది. ఎఱ్ఱ కలువల వంటి సోగ కన్నులలో శృంగారం అతిశయించి ఆమె మదనుని జనకునితో మన్మధ యుద్ధమున అలిసిపోయియున్నది. అందుచే ఆ తల్లి నిదురించుచున్నది.
మురిపెము లొలుకు అభినయం చూపిన ఆ తల్లి ముత్యాల హంసతూలికా తల్పంపై పరవశురాలై పవ్వళించి యున్నది. తిరుమలాధీశుడైన శ్రీవేంకటపతి కౌగిటిలో కరిగిపోయిన ఆ తల్లి అరవిచ్చిన మొగ్గవలె చిరుచెమటలు కమ్మి శయనించుచున్నది.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)
Watch for audio - https://youtu.be/7X1IeF5kKH0
No comments:
Post a Comment