ఇన్నిటా నొరయక యెఱు కేది
వెన్నునికృపఁగా వెలసేది
వెన్నునికృపఁగా వెలసేది
కోపము మతిలోఁ గుందినపుడు వో
పాపము లన్నియుఁ బాసేది
తీపులయాసలు దీరినపుడు వో
తాపత్రయములు దలఁగేది
పాపము లన్నియుఁ బాసేది
తీపులయాసలు దీరినపుడు వో
తాపత్రయములు దలఁగేది
ఘనకర్మంబులు గడచినపుడువో
వెనుకొనుభవములు విడిచేది
మునుకొని యింద్రియములు వీడినఁబో
పనివడి విరక్తి బలిసేది
వెనుకొనుభవములు విడిచేది
మునుకొని యింద్రియములు వీడినఁబో
పనివడి విరక్తి బలిసేది
ఆఁకటిరుచు లివి యణఁగినపుడు వో
చేకొని సుఖమునుఁ జెందేది
యీకడ శ్రీవేంకటేశ్వరు శరణము
పైకొనిననుఁబో బదికేది
చేకొని సుఖమునుఁ జెందేది
యీకడ శ్రీవేంకటేశ్వరు శరణము
పైకొనిననుఁబో బదికేది
భావము:
విష్ణుని దయ వలననే జ్ఞానము లభించును . కోపము విడిచినచో పాప భావములు మనలను విడిచి పోవును . కోరికలపై మోజు తీరినపుడే మూడు రకములైన బాధలు తొలగును. అనగా శరీర సంబంధమైనవి , మానసికములైనవి, దేశ పరములైనవి తొలగును. గొప్ప పనులు అనగా కీర్తి కొరకై , స్వలాభము కొరకై పనులు చేయుట మానినపుడే సంసారపు చిక్కులు వైదొలగును . ఇంద్రియములచే నడిపింప బడుట మానినపుడే వైరాగ్యము బలపడును . రుచి కొరకై ఆకలిని మించి భుజించుట విడిచినపుడే నిజమైన సుఖము ప్రాప్తించును.శ్రీ వేంకటేశ్వరుని శరణు పొందినపుడే బ్రతుకు సార్ధకమగును. కోరికలు, కోపము, కీర్తికాముకత లేనివాడు సమాజమునకై శ్రద్ధతో పనిచేసి స్వామి దయను పొందగలడు .
(సంకీర్తనమునకు భావమూలం… డా!!గురు కొండవీటి జ్యోతిర్మయి గారు)
విష్ణుని దయ వలననే జ్ఞానము లభించును . కోపము విడిచినచో పాప భావములు మనలను విడిచి పోవును . కోరికలపై మోజు తీరినపుడే మూడు రకములైన బాధలు తొలగును. అనగా శరీర సంబంధమైనవి , మానసికములైనవి, దేశ పరములైనవి తొలగును. గొప్ప పనులు అనగా కీర్తి కొరకై , స్వలాభము కొరకై పనులు చేయుట మానినపుడే సంసారపు చిక్కులు వైదొలగును . ఇంద్రియములచే నడిపింప బడుట మానినపుడే వైరాగ్యము బలపడును . రుచి కొరకై ఆకలిని మించి భుజించుట విడిచినపుడే నిజమైన సుఖము ప్రాప్తించును.శ్రీ వేంకటేశ్వరుని శరణు పొందినపుడే బ్రతుకు సార్ధకమగును. కోరికలు, కోపము, కీర్తికాముకత లేనివాడు సమాజమునకై శ్రద్ధతో పనిచేసి స్వామి దయను పొందగలడు .
(సంకీర్తనమునకు భావమూలం… డా!!గురు కొండవీటి జ్యోతిర్మయి గారు)
Watch for audio - https://youtu.be/BDMrizxfLgE
No comments:
Post a Comment